టి-శాట్ నెట్వర్క్ ఛానళ్లను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని

టి-శాట్ నెట్వర్క్ ఛానళ్లను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని

టి-శాట్ నెట్వర్క్ ఛానళ్లను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అన్ లైన్ విద్యలో తెలంగాణ విద్యార్థులకు సంపూర్ణ సేవలు అందించడమే ప్రత్యేక లక్ష్యంగా ఎంచుకున్నామని తెలిపారు. విద్యా రంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లను వినియోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తామని వెళ్లడించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని టి-సాట్ కార్యాలయాన్ని వినోద్ కుమార్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ శేషుకుమారి, టీఎస్ హెచ్ఈసీ వైస్ చైర్మన్ వెంకటరమణతో కలిసి సందర్శించారు. కొవిడ్ మహమ్మారి కారణంగా ఆన్ లైన్ విద్యపై తెలంగాణ మంత్రి వర్గం ఇటీవల  తీసుకున్న నిర్ణయం మేరకు టి-శాట్ ను సందర్శించిన వినోద్ కుమార్ సీఈవో శైలేష్ రెడ్డితో  ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 
తొలుత టి-సాట్ కార్యాలయ ఆవరణ అంత కలియతిరిగి వివిధ విభాగాలను పరిశీలించారు. టి-శాట్ నెట్వర్క్ ఛానళ్లు అందిస్తున్న ప్రసారాలకు సంబంధించిన వివరాలను వైస్ చైర్మన్ కు వివరించారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత అన్ లైన్ విద్య అందించడంలో టి-సాట్ ఛానళ్లు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఇప్పటి వరకు చేస్తున్న కృషికి తోడుగా మరిన్ని సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. 
ఇప్పటికే కేబుల్, ఆర్వోటీ, సోషల్ మీడియా వేదిక ద్వార ప్రజలకు అందుబాటులో ఉన్న టి-శాట్ ను డీటీహెచ్ (డైరెక్ట్ టు హోం) టాటాస్కై, సన్ డైరెక్ట్, జీయో టీవీ వంటి వాటి ద్వారా ప్రసారాలు అందించేందుకు ఐటి శాఖ తరుఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేయగా.. తక్షణమే కేంద్ర ప్రసార శాఖ మంత్రి జవదేకర్ తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. త్వరలోనే టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లను దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు